తయారు చేయు విధానం
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మూడు గ్లాసుల నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలి . ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో పావు గ్లాసు సెనగపప్పు వేసి రెండు పొంగులు రానివ్వాలి . ఇప్పుడు పొంగుతున్న నీళ్ళలో ఉప్పు వేసి మల్లి మళ్ళి ఒక పొంగు రానిచ్చి బియ్యపురవ్వను పోసి ఉండ కట్టకుండా దగ్గర పడేదాకా కలిపి మూత పెట్టాలి . ఒక ఐదు నిముషాల తరువాత మూత తీసి రవ్వ మెత్తగా వుడికిందో లేదో చూడాలి . ఉడికిన రవ్వను స్టవ్ మిద నుంచి దించేసి బాగా చల్లార నివ్వాలి . ఇప్పుడు చల్లారిన రవ్వను ఉండలుగా చేసి ఒక గిన్నెలో పెట్టి ఆవిరి మీద ఒక్క పదినిముషాలు ఉడక నివ్వాలి ... అంతే మన బొజ్జ గణపయ్యకు ఎంతో ప్రీతి పాత్రమైన ఉండ్రాళ్ళు రెడీ