- Step 1
మైదాను జల్లించుకొని మధ్యలో గొయ్యిలా చేసి, వనస్పతి వేసి బాగా తెల్లగా అయ్యే వరకూ ఉంచాలి.
- Step 2
తరువాత పంచదార పొడి చేర్చి, కొద్దికొద్దిగా మైదాను చేర్చుతూ ముద్దలా చేయాలి.
- Step 3
మైదా అంతా కలిసిన తరువాత బాగా కలిపి మర్దనా చేసి, పిండి ముద్దలా చేస్తే మెత్తగా తయారవుతుంది.
- Step 4
ఈ పిండికి యాలకుల పొడి కూడా కలుపుకోవాలి. తరువాత ఈ ముద్దను పీట మీద ఉంచి మందంగా ఉన్న చపాతీలా చేయాలి.
- Step 5
పదునుగా ఉన్న గ్లాసు అంచుతో ఆ చపాతీని కోస్తే అర్థచంద్రాకారంలోఉన్నట్లుగా బిస్కెట్లు తయారవుతాయి.
- Step 6
అలా తయారయిన వాటిని ఒక ట్రేలో అమర్చి 180 డిగ్రీల సెల్సియస్ దగ్గర 20 నిమిషాలపాటు మైక్రోఓవెన్లో ఉడికించాలి.
- Step 7
అంతే చాంద్ బిస్కట్స్ రెడీ! చల్లారిన తరువాత వీటీని తింటే చాలా రుచిగా ఉంటాయి.