- Step 1
ముందుగా మైదాను ఓ గిన్నెలో వేసి గుడ్డులోని తెల్లసొనను వేసి సరిపడ నీరును పోసి బాగా కలపాలి.
- Step 2
చపాతీ పిండిలాగా మెత్తగా కలపాలి. దీన్ని తడిగుడ్డతో కప్పి అరగంట సేపు ఉంచాలి.
- Step 3
ఇంతలో మసాలా సామాగ్రిని తయారు చేసుకోవాలి. చికెన్ను ఉడకబెట్టు కోవాలి.
- Step 4
కూరలను, చికెన్ను సన్నని పొడు గాటి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
- Step 5
తర్వాత బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి ముక్కలు, బీన్స్, క్యాబేజి, క్యారెట్ ముక్కలు, కారం, ఉప్పులను వేసి చికెన్ ను ఒకటి తర్వాత ఒకటిగా వేసి వేయించి దించాలి.
- Step 6
తర్వాత కలిపి పెట్టిన చపాతీ పిండిని తీసి వత్తి అందులో చికెన్ మసాలా మిశ్రమాన్ని పెట్టి మూసి రోల్స్లాగా చుట్టి పెట్టాలి. కాగిన నూనెలో ఎర్రగా వేయించి దించాలి.