- Step 1
ముందుగా అరకేజీ బియ్యాన్ని బాగా కడిగి పొడి, పొడిగా అన్నం వార్చుకుని పక్కన ఉంచుకోవాలి.
- Step 2
పుదీనా ఆకులను శుభ్రంగ కడిగి, మిక్సీలో వేసి పేస్ట్లాగా చేసుకోవాలి.
- Step 3
ఇప్పుడు బాణలిలో నూనె వేసి.. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, చెక్క, లవంగాలు, పుదీనా పేస్ట్ వేసి దగ్గరయ్యేదాకా వేయించాలి.
- Step 4
ఇప్పుడు వార్చి పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఓ వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని పొడిపొడిగా కలపాలి.
- Step 5
తరువాత అందులో పైన తయారు చేసుకున్న పుదీనా మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
- Step 6
చివర్లో సరిపడా ఉప్పును వేసి, మళ్లీ ఒకసారి కలుపుకోవాలి. అంతే కమ్మటి వాసనతో అదిరిపోయే అల్లం వెల్లుల్లిలతో పుదీనా రైస్ తయారైనట్లే...! దీన్ని ఉల్లిపాయలు, టమోటోలతో కలిపి తయారు చేసిన పెరుగు పచ్చడితో కలిపి తింటే చాలా బాగుంటుంది.