- Step 1
ముందుగా ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి, అల్లం పేస్ట్ శుభ్రం చేసిన చేపల ముక్కలకు పట్టించి 20 నిమిషాలు పక్కన వుంచుకోవాలి.
- Step 2
మూకుడులో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేడిచేసి, జీలకర్ర, ధనియాలు, ఎండు మిరపకాయలు, కొబ్బరి తురుము ఒక్కొక్కటిగా వేసి వేయించాలి.
- Step 3
వీటిని కప్పు నీరు పోసి రుబ్బుకోవాలి.
- Step 4
మూకుడులో మిగతా నూనె వేసి కరివేపాకు, మెంతులు వేసి తాలింపు పెట్టి ఉల్లిపాయలు కలిపి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి.
- Step 5
టమేటో ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించి, రుబ్బుకున్న పేస్ట్, అరకప్పు నీరు, చింతపండు గుజ్జు, ఉప్పు కలిపి ఉడికించాలి.
- Step 6
తర్వాత చేపల ముక్కలు వేసి మెత్తబడేవరకు సుమారు ఐదు నిమిషాలు ఉడికించి కొబ్బరిపాలు పోయాలి.
- Step 7
మరో రెండు నిమిషాలు ఉడికించి కొత్తిమీరతో గార్నిష్ చేసి.. వేడి వేడి రైస్తో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది.